Monday, March 3Thank you for visiting

లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

Spread the love

2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్ల‌డిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చ‌దివిన‌ట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ ప్రకారం డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

మొదటి దశలో.. 26 మంది నిరక్షరాస్యులు..

మొదటి దశ ఎన్నికలలో, 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని నివేదించగా, 836 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నారు. అదనంగా, 36 మంది అభ్యర్థులు తాము కేవలం అక్షరాస్యులమ‌ని, 26 మంది నిరక్షరాస్యులని చెప్పగా, నలుగురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు.

రెండో దశలో..

రెండవ దశలో, 533 మంది అభ్యర్థులు తాము 5వ త‌ర‌గ‌తి నుంచి 12వ తరగతుల వ‌ర‌కు చ‌దువుకున్నామ‌ని ప్రకటించగా, 574 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చ‌దివిన‌ట్లు నివేదించారు. దాదాపు 37 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులని, ఎనిమిది మంది నిరక్షరాస్యులని, ముగ్గురు తమ విద్యార్హతలను అందించలేదు.

మూడో దశలో..

ఇక మూడవ దశలో, 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని నివేదించగా, 591 మంది అభ్యర్థులు తమను తాము గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు ప్రకటించుకున్నారు. అదనంగా, 56 మంది అక్షరాస్యులు, 19 మంది నిరక్షరాస్యులు. ముగ్గురు అభ్యర్థులు తమ విద్యార్హతలను వెల్లడించలేదు.

నాలుగో దశలో 

నాలుగో దశకు సంబంధించి, 644 మంది అభ్యర్థులు తమ విద్యా స్థాయిలు 5వ, 12వ తరగతుల మధ్య ఉన్న‌ట్లు ప్రకటించగా, 944 మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ అని నివేదించారు. 30 మంది అభ్యర్థులు తమను తాము కేవలం అక్షరాస్యులుగా ప్రకటించుకోగా, 26 మంది నిరక్షరాస్యులని ప్రకటించారు.

ఐదవ దశలో.. 

ఐదో దశలో, 293 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని నివేదించగా, 349 మంది తమను తాము గ్రాడ్యుయేట్లు లేదా ఉన్నత డిగ్రీలు కలిగి ఉన్నట్లు ప్రకటించారు. దాదాపు 20 మంది అభ్యర్థులు అక్షరాస్యులుగా, ఐదుగురు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు తమ విద్యార్హతలను వెల్లడించలేదు.

ఆరో దశలో..

ఆరవ దశలో, 332 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ, 12వ తరగతుల మధ్యగా ప్రకటించగా, 487 మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లు నివేదించారు. 22 మంది డిప్లొమా హోల్డర్లు, 12 మంది కేవలం అక్షరాస్యులు, 13 మంది నిరక్షరాస్యులు ఉన్నారు.

చివరి దశలో..

ఏడవ దశ ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉన్న 402 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని ADR Election Data నివేదించగా, 430 మంది తమను తాము గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు ప్రకటించారు. 20 మంది డిప్లొమా హోల్డర్లు, 26 మంది కేవలం అక్షరాస్యులు, 24 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు తమ విద్యార్హతలను వెల్లడించలేదు.

ఇదిలా ఉండ‌గా, ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4 న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు దశల పోలింగ్ పూర్త‌యింది. మే 25, జూన్ 1 న ఆరో ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version